Telangana

గీతంలో ఘనంగా నవరాత్రి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో విద్యార్థులు బతుకమ్మ, నవరాత్రి సంబరాలను ‘జష్ను-ఎ-బహారా’ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, హాజరైన వారికి శాశ్వత జ్జాపకాలను మిగిల్చింది.తొలుత, బతుకమ్మ తయారీతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పూల పండుగ స్ఫూర్తితో అందమైన సాంప్రదాయ పూల అలంకరణలను రూపొందించారు. ఆ తరువాత రంగోలి పోటీలో ఉత్సాహభరితంగా పాల్గొని, తమ సృజనాత్మకతను క్లిష్టమైన రంగోలీ డిజైన్ల ద్వారా ప్రదర్శించి, పండుగ వాతావరణాన్ని సృష్టించారు.విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, ఫుడ్ స్టాల్స్ రుచికరమైన వివిధ రకాల వంటకాలను అందించి, విభిన్నమైన వంటల ఆనందాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పించాయి. ఇక చివరగా, ఈ వేడుకలను మరపురాని గర్బా నైట్ తో ముగించారు. ఇక్కడ విద్యార్థులు నవరాత్రి పండుగ లయకు అనుగుణంగా నృత్యం చేస్తూ, మైమరచిపోయారు.సాంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ స్ఫూర్తిని కలిపి ‘జష్ను-ఎ-బహారా’లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మారింది.

 

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

9 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

21 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

21 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

21 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

21 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago