పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ లో పరిశోధనను పెంపొందించడానికి జూలై 20-21 తేదీలలో ‘విద్యార్థుల కోసం నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హెదరాబాద్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు ప్రొఫెసర్ కుర్రి శ్రీ స్రవంతి శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.కళ, వాస్తుశిల్పం ద్వారా నగరాల గుర్తింపు; నిర్మాణ సంస్కృతి, వారసత్వ నిర్వహణ, పర్యావరణ సామర్థ్యం, స్థిరమైన భవిష్యత్తు; సమకాలీన నిర్మాణ పద్ధతులు, వాస్తుశిల్పంలో వైవిధ్యం వంటి ఇతివృత్తాలతో ఈ సింపోజియం నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు.ఆసక్తి ఉన్నవారు, జూన్ 12వ తేదీలోగా పరిశోధనా పత్రాలను సమర్పించాలని; వాటిపై వ్యాఖ్య లేదా ఆమోదాన్ని జూలై 1వ తేదీలోగా తెలియజేస్తాయని, తుది సమర్పణ జూలై 10వ తేదీగా చేయాలని నిర్వాహకురాలు స్పష్టీకరించారు.బీఆర్క్ ఎంఆర్క్, పీహెచ్ చేస్తున్న విద్యార్థులు ఈ సింపోజియంలో పాల్గొనడానికి అర్హులని, ఇందులో పత్ర సమర్పణ చేసేవారికి ఉచిత వసతితో పాటు 3-ఏ/సీ రెల్లు టిక్కెట్లు ఇస్తామని ఆమె తెలిపారు. ఇతరత్రా వివరాల కోసం spaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…