ప్రవాహ అస్థిరతలను అధ్యయనం చేయనున్న గీతం సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు మరో ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ)లోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజాకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.తిరిగే వక్ర మైక్రో పైపులలో ప్రవాహ అస్థిరతల అధ్యయనం’ పేరిట చేపట్టే ఈ ప్రాజెక్టు, అధునాతన సంఖ్యా, విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి మైక్రోడొమైన్ లలో ద్రవ ప్రవాహ ప్రవర్తనను మూడేళ్ల కాల పరిమితితో పరిశోధించడానికి ఉద్దేశించినదని తెలిపారు. మైక్రోఫ్లూయిడిక్స్, సంబంధిత రంగాలలో కీలకమైన అనువర్తనాలను కలిగి ఉన్న ప్రవాహ అస్థిరతలపై చేపట్టే ఈ పరిశోధన, దీనిపై లోతైన అవగాహనను అందిస్తుందని అభిలషిస్తున్నామన్నారు.ఈ పరిశోధనలో డాక్టర్ రెజాకు సహాయకారికి ఉండేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) అవసరమని తెలిపారు. ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ (గణితం) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, గేట్ లేదా నెట్ అర్హతతో పాటు మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామింగ్ లో ప్రావీణ్యం ఉన్న 32 ఏళ్ల వయస్సు లోపు వారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, మహిళలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జేఆర్ఎఫ్ గా ఎన్నికైన వారికి నెలవారీ రూ.37 వేల భత్యంతో పాటు ఇంటి అద్దె అలవెన్సు కూడా ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డాక్టర్ రెజా 78730 49059ను సంప్రదించాలని, లేదా mreza@gitam.edu or motaharreza90@gmail.com కు ఈ-మెయిల్ దరఖాస్తు చేయాలని సూచించారు.ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించిన డాక్టర్ రెజాను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డైరెక్టర్లు, విభాగాధిపతులు అభినందించి, నిర్ణీత కాల వ్యవధిలోగా దీనిని విజయవంతంగా పూర్తిచేయమని ప్రోత్సహించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు, శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో గీతం నిబద్ధతను తేటతెల్లం చేస్తోందన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…