Telangana

సూక్ష్మ , చిన్న పరిశ్రమల ద్వారానే జాతీయ ప్రగతి…- గీతం సదస్సులో వక్తలు

_ ఘనంగా ఎంఎస్ఎంఈ కాంక్లేవ్

మనవార్తలు ,పటాన్ చెరు:

మన దేశ పురోగతి ఎక్కువగా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమపై ఆధారపడి ఉందని టీసీఎస్ ఐయాన్ బిజినెస్ యూనిట్ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ , గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , మనదేశంలో 65 మిలియన్ల చిన్న , మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని , అందులో అధిక భాగం సూక్ష్మ సంస్థలదేనన్నారు . అవి మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడంతో పాటు స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ ) లో ముఖ్య భూమికను పోషిస్తున్నాయని చెప్పారు . ఎంఎస్ఎంఈలు 120 మిలియన్లకు పెగా ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఎగుమతుల్లో 40 శాతం వాటా వాటిదేనని తెలిపారు .

ఎంఎస్ఎంఈలపై జాతీయ విధానం నెమ్మదిగా మారుతోందని , ఈ సానుకూల పరిణామానికి తోడు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం , చైనాతో మన దేశం సంఘర్షణ వంటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎంఎస్ఎంఈలు నెలకొల్పడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయని వెంగుస్వామి పేర్కొన్నారు . చాలా సంస్థలు మూలధనం , ప్రొక్యూర్మెంట్ , నెపుణ్యం గల పనివారు , అమ్మకాలు , మార్కెటింగ్ , లాజిస్టిక్స్ వంటి సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు . డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆయా సమస్యలకు తగిన పరిష్కారాలను విద్యార్థులు చూపగలిగితే వారు కూడా వ్యవస్థాపకులుగా ఎదగడానికి పెద్ద అవకాశంగా ఆయన అభివర్ణించారు .

విద్యార్థులు బృ ందాలుగా ఏర్పడి సమీపంలోని పరిశ్రమలకు వెళ్లాలని , వాటిని బాగా అధ్యయనం చేసి అంతర్గత విషయాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలని వెంగుస్వామి సూచించారు . సభాధ్యక్షత వహించిన గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తన స్వాగతోపన్యాసంలో వ్యవస్థాపకుడి ప్రాముఖ్యతను వివరించారు . ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడం , సవాళ్ళను స్వీకరించే సామర్థ్యం , నిర్వ హణా మెళకువలు వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడాయన్నారు . సంప్రదాయ ఎంఎస్ఎంఈలు డిజిటలెజేషన్ వెపు మళ్లాలని వీసీ సూచించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , తన వందన సమర్పణలో ఈ సదస్సు విజయవంతం కావడానికి తోడ్పడిన వారందరినీ పేరుపేరునా అభినందించారు . ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె.దలాల్ , ప్లానెట్ సీఈవో , భారత వాణిజ్య మండలి ప్రాంతీయ అధిపతి నవీన్ మాడిశెట్టి , ఏఐఎంఏ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ సుందిప్ అతిత్ , డాక్టర్ హోమీ భాభా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్రట్ స్వాతి నావల్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

6 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago