మనవార్తలు ,పటాన్ చెరు:
మన దేశ పురోగతి ఎక్కువగా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమపై ఆధారపడి ఉందని టీసీఎస్ ఐయాన్ బిజినెస్ యూనిట్ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ , గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , మనదేశంలో 65 మిలియన్ల చిన్న , మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని , అందులో అధిక భాగం సూక్ష్మ సంస్థలదేనన్నారు . అవి మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడంతో పాటు స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ ) లో ముఖ్య భూమికను పోషిస్తున్నాయని చెప్పారు . ఎంఎస్ఎంఈలు 120 మిలియన్లకు పెగా ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఎగుమతుల్లో 40 శాతం వాటా వాటిదేనని తెలిపారు .
ఎంఎస్ఎంఈలపై జాతీయ విధానం నెమ్మదిగా మారుతోందని , ఈ సానుకూల పరిణామానికి తోడు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం , చైనాతో మన దేశం సంఘర్షణ వంటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎంఎస్ఎంఈలు నెలకొల్పడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయని వెంగుస్వామి పేర్కొన్నారు . చాలా సంస్థలు మూలధనం , ప్రొక్యూర్మెంట్ , నెపుణ్యం గల పనివారు , అమ్మకాలు , మార్కెటింగ్ , లాజిస్టిక్స్ వంటి సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు . డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆయా సమస్యలకు తగిన పరిష్కారాలను విద్యార్థులు చూపగలిగితే వారు కూడా వ్యవస్థాపకులుగా ఎదగడానికి పెద్ద అవకాశంగా ఆయన అభివర్ణించారు .
విద్యార్థులు బృ ందాలుగా ఏర్పడి సమీపంలోని పరిశ్రమలకు వెళ్లాలని , వాటిని బాగా అధ్యయనం చేసి అంతర్గత విషయాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలని వెంగుస్వామి సూచించారు . సభాధ్యక్షత వహించిన గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తన స్వాగతోపన్యాసంలో వ్యవస్థాపకుడి ప్రాముఖ్యతను వివరించారు . ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడం , సవాళ్ళను స్వీకరించే సామర్థ్యం , నిర్వ హణా మెళకువలు వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడాయన్నారు . సంప్రదాయ ఎంఎస్ఎంఈలు డిజిటలెజేషన్ వెపు మళ్లాలని వీసీ సూచించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , తన వందన సమర్పణలో ఈ సదస్సు విజయవంతం కావడానికి తోడ్పడిన వారందరినీ పేరుపేరునా అభినందించారు . ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ కె.దలాల్ , ప్లానెట్ సీఈవో , భారత వాణిజ్య మండలి ప్రాంతీయ అధిపతి నవీన్ మాడిశెట్టి , ఏఐఎంఏ సీనియర్ వెస్ట్ ప్రెసిడెంట్ సుందిప్ అతిత్ , డాక్టర్ హోమీ భాభా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్రట్ స్వాతి నావల్ తదితరులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…