మనవార్తలు ,పటాన్ చెరు:
దక్షిణాఫ్రికా , డర్బన్లోని క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో రెండు నెలల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లనున్నారు . మే 1 నుంచి జూన్ 30 వ తేదీ వరకు ఆయన డర్బన్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . నూతన ఫార్మాస్యూటికల్ యాక్టివ్ కాంపౌండ్లు , ఎల్డీఏ ఆమోదించిన సమ్మేళనాలను వివిధ ఫార్మాస్యూటికల్ డోసేజ్లలో నిర్ణయించడానికి ఒక అధునాతన లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిని అభివృద్ధి చేయడంతో పాటు ప్రయోగాల రూపకల్పన , యూనిక్ గ్రీన్ క్రోమాటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా డిజెన్ ద్వారా విశ్లేషణాత్మక నాణ్యతను అమలు చేయడం ఈ పర్యటన ఉద్దేశంగా ఆయన వివరించారు . పరిశోధనల కోసం ఇంతకు మునుపు దక్షిణాఫ్రికా , అమెరికా వెళ్ళొచ్చిన డాక్టర్ కటారి , ప్రస్తుతం మరోసారి డర్బన్ కు పయనం కావడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు , ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…