మనవార్తలు ,పటాన్ చెరు:
దక్షిణాఫ్రికా , డర్బన్లోని క్వాజులు నాటల్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో రెండు నెలల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లనున్నారు . మే 1 నుంచి జూన్ 30 వ తేదీ వరకు ఆయన డర్బన్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . నూతన ఫార్మాస్యూటికల్ యాక్టివ్ కాంపౌండ్లు , ఎల్డీఏ ఆమోదించిన సమ్మేళనాలను వివిధ ఫార్మాస్యూటికల్ డోసేజ్లలో నిర్ణయించడానికి ఒక అధునాతన లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిని అభివృద్ధి చేయడంతో పాటు ప్రయోగాల రూపకల్పన , యూనిక్ గ్రీన్ క్రోమాటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా డిజెన్ ద్వారా విశ్లేషణాత్మక నాణ్యతను అమలు చేయడం ఈ పర్యటన ఉద్దేశంగా ఆయన వివరించారు . పరిశోధనల కోసం ఇంతకు మునుపు దక్షిణాఫ్రికా , అమెరికా వెళ్ళొచ్చిన డాక్టర్ కటారి , ప్రస్తుతం మరోసారి డర్బన్ కు పయనం కావడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు , ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…