Telangana

తప్పుడు కేసుల గతిశీలతపై జాతీయ సదస్సు

వేదిక కానున్న గీతం అనుబంధ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ

పత్ర సమర్పణకు ఆహ్వానం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ- కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ‘తప్పుడు కేసుల గతిశీలత (డైనమిక్స్)’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఈ ఏడాది ఆగస్టు 21-22 తేదీలలో నిర్వహించనున్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, పౌర సమాజ నిపుణులు కలిసి ‘తప్పుడు కేసులు’ అని పిలువబడే ఆరోపణల యొక్క చర్చ, చరిత్ర, అనుభవాలు, సామాజిక ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ప్రత్యేకించి లింగం, చట్ట అమలు పద్ధతులు, ప్రజా అవగాహనలపై దృష్టి సారించనున్నట్టు వివరించారు.ఈ కార్యక్రమం చట్ట దుర్వినియోగం కథనం, న్యాయ వ్యవస్థలపై దాని ప్రభావాలు, దాని విస్తృత సామాజిక పరిణామాలపై ఆధారాల సహిత సంభాషణను పెంపొందించడం, ఇతర అధికార పరిధి నుంచి తులనాత్మక అంతర్దృష్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఈ సమావేశంలో ఔత్సాహికులు పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చని తెలియజేశారు. అమూర్త పత్రాలను (సారాంశాలను) ఫిబ్రవరి 20 లోగా సమర్పించాలని, ఎంపిక చేసిన వాటిని మార్చి 5 నుంచి 14వ తేదీల మధ్య ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించాలని, వాటిపై తుది అంగీకారాన్ని మార్చి 20 లోగా తెలియజేస్తామన్నారు. ముసాయిదా (డ్రాఫ్ట్) పత్రాలను మే 15 లోగా సమర్పిస్తే, వాటిపై అభిప్రాయాన్ని జూన్ 15 లోగా తెలియజేస్తామని, సవరించిన తుది పత్రాలను ఆగస్టు 1 లోగా సమర్పించాలని స్పష్టీకరించారు.ఈ సదస్సు హైదరాబాదులోని కౌటిల్య ప్రాంగణంలో జరుగుతుందన్నారు. భారతదేశం నుంచి పత్ర సమర్పణ చేసేవారు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చని, అంతర్జాతీయ స్కాలర్లకు పరిమిత ఆన్ లైన్ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.పరిశోధనా పత్రాలను conference@kspp.edu.in కు పంపవచ్చని, అదే మెయిలు ద్వారా ఇతర వివరాలు కూడా తెలుసుకోవచ్చని సూచించారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago