– అమూర్త పత్ర సమర్పణకు తుది గడువు : ఈనెల 20
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 8-9న ‘ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ ‘ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎం . కిరణ్మయిరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈ సదస్సు ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల సమర్థ వినియోగం , వ్యర్థాల పునర్వినియోగం , శక్తిని సముచితంగా ఉపయోగించడం , ఆరోగ్యం – భద్రతా సమస్యలు , పర్యావరణ నివారణ , క్యాప్టివ్ క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నట్టు ఆమె పేర్కొన్నారు . ఈ సదస్సులో పాల్గొనేవారు వ్యర్థ నిర్వహణ , పునర్వినియోగం , నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం , నీటి శుద్దీకరణ , విద్యుత్ వాహనాలు , పర్యావరణ నివారణ , పునరుత్పాదక ఇంధన వనరులు , పర్యావరణ వ్యవస్థ సేవలు మొదలైన వాటిపై పరిశోధక వ్యాసాలను ప్రచురించవచ్చని డాక్టర్ కిరణ్మయి తెలియజేశారు . అమూర్త ( అబాక్ట్ ) పత్ర సమర్పణకు ఈనెల 20 తుది గడువని , ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తిగల వారు తమ పేర్లను ఈనెలాఖరులోగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు . రిజిస్ట్రేషన్ ఫీజు , ఇతర వివరాల కోసం 99660 26489 ను సంప్రదించాలని , లేదా gtsf2022@gitam.in కు ఈ – మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…