Telangana

హరిత సాంకేతికతపై జాతీయ సదస్సు…

– అమూర్త పత్ర సమర్పణకు తుది గడువు : ఈనెల 20

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 8-9న ‘ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ ‘ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎం . కిరణ్మయిరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈ సదస్సు ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల సమర్థ వినియోగం , వ్యర్థాల పునర్వినియోగం , శక్తిని సముచితంగా ఉపయోగించడం , ఆరోగ్యం – భద్రతా సమస్యలు , పర్యావరణ నివారణ , క్యాప్టివ్ క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నట్టు ఆమె పేర్కొన్నారు . ఈ సదస్సులో పాల్గొనేవారు వ్యర్థ నిర్వహణ , పునర్వినియోగం , నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం , నీటి శుద్దీకరణ , విద్యుత్ వాహనాలు , పర్యావరణ నివారణ , పునరుత్పాదక ఇంధన వనరులు , పర్యావరణ వ్యవస్థ సేవలు మొదలైన వాటిపై పరిశోధక వ్యాసాలను ప్రచురించవచ్చని డాక్టర్ కిరణ్మయి తెలియజేశారు . అమూర్త ( అబాక్ట్ ) పత్ర సమర్పణకు ఈనెల 20 తుది గడువని , ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తిగల వారు తమ పేర్లను ఈనెలాఖరులోగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు . రిజిస్ట్రేషన్ ఫీజు , ఇతర వివరాల కోసం 99660 26489 ను సంప్రదించాలని , లేదా gtsf2022@gitam.in కు ఈ – మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago