Telangana

శ్రీశైల మల్లన్న సేవలో నారా లోకేష్ దంపతులు

శ్రీశైలం,  మనవార్తలు ప్రతినిధి :

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుండిపెంట చేరుకున్న లోకేష్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా సాక్షి గణపతి ఆలయం చేరుకుని అక్కడ సాక్షి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన లోకేష్ దంపతులకు శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత లోకేష్ కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో లోకేష్ కుటుంబ సభ్యులకు అర్చకులు, వేదపండితులు వేదఆశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లోకేష్ కుటుంబ సభ్యులకు స్వామివారి శేష వస్త్రాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల జిల్లా టిడిపి, జనసెన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago