పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని విజువల్ కమ్యూనికేషన్స్ బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థిని భావరాజు నందిని న్యూఢిల్లీలో జనవరి 26న నిర్వహించిన 75వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల సాంస్కృతిక ప్రదర్శనలో తన ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని ఆమె అధ్యాపకురాలు సంధ్యా గాండే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన అతిథులు, పలువురు రాయబారులు, పౌర, సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో గీతం విద్యార్థిని పాల్గొని, తన కళా నెపుణ్యాన్ని ప్రదర్శించడం ఓ మరుపురాని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఆమె కళాభినయానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయని, ఇది గీతమ్ లో పెంపొందించిన సాంస్కృతిక చైతన్యం. కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకలలో ఎన్ సీసీ కేడటగా కళాభినయాన్ని ప్రదర్శించే అనకాశం అందుకున్న భావరాజు నందినిని గీతం,హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు విభాగాధిపతులు, ఆధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించినట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమానికి నందినిని సిద్ధం చేయడంలో తనవంతు సహకారం అందించినట్టు అధ్యాపకురాలు సంధ్యా గాండే ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…