Telangana

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలో ఈనెల 23న జరిగే జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్లు ఉన్నాయని, తెల్లాపూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, అమీన్పూర్, బొల్లారం, జిన్నారం, గడ్డ పోతారం, గుమ్మడిదల మున్సిపల్ లో దాదాపు 1000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపల్ లో కార్మికులు వందలాదిమంది ఉన్నారన్నారు. జిన్నారం మున్సిపల్ లో గత మూడు నెలలుగా వేత నాలు చెల్లించడం ప్రస్తుత వర్షాకాలంలో తెల్లాపూర్ మున్సిపల్ లో 60 మంది మున్సిపల్ కార్మికులకు నేటికీ రెయిన్ కోర్టులు, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీస వేతనం కింద 26వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. పటాన్ చెరు లో జరిగే మున్సిపల్ కార్మికుల ఐదవ మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. జిల్లాలోని మున్సిపల్ వర్కర్లందరూ ఈనెల 23న పటాన్ చెరు పట్టణంలో జరిగే భారీ ర్యాలీ, మహాసభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయరాం, పోచయ్య, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago