Telangana

కిర్బీ లో అంబరాన్నింటిన సంబురాలు

– కిర్బీ పరిశ్రమలో వరసగా నాలుగవసారి సిఐటియు విజయ దుందుభి

– బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గెలుపు

– ఎన్ని కుయుక్తులు పన్నిన … విజయం ఎర్రజెండాదే

– పరిశ్రమలో కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ

బాణసంచా కాల్చి, సంబురాలలో మునిగిన కార్మికులు

ఈ విజయం కిర్బీ కార్మికులకు అంకితం

కిర్బీ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మండలంలోని పాశం మైలారం పారిశ్రామిక వాడ లో గల కిర్బీ పరిశ్రమలో గురువారం జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు నాలుగోసారి విజయ దుందుభి మోగించింది. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు,బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తము 578 ఓట్లకు గాను 576 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లలేవు, సీఐటీయూ కి 295, బిఆర్టీయూ కూటమికి 281 ఓట్లు రాగా 14 ఓట్ల తేడాతో బిఆర్టియూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న సిఐటియు ఎర్రజెండా ను వరుసగా నాలుగవసారి గెలిపించిన కిర్బీ కార్మికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. సిఐటియు గెలుపుతో కార్మికుల జీవితాలు బాగుపడతాయని నమ్మిన కార్మికులు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధించేందుకు ఈ గెలుపు దోహదపడుతుందని అన్నారు. సిఐటియుతోనే కార్మికులకు రక్షణ ఉంటుందన్నారు.

కార్మికులకు ఇచ్చిన హామీలన్నిటిని రాబోయే రోజుల్లో నెరవేర్చే విధంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని యూనియన్లు కూటములుగా ఏర్పడిన, ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ ఎర్రజెండాదే విజయన్నారు. ఈ గెలుపు కార్మికుల విజయం గా ఆయన అభివర్ణించారు. సీఐటీయును కార్మికులు ఆదరించి నాలుగవసారివిజయం అందించిన కార్మికులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.గెలిచిన వెంటనే పరిశ్రమలో కార్మికుల సంబురాలు అంబరానంటాయి. నాయకులను రంగులతో ముంచెత్తి సంబరాలు చేసుకున్నారు

ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కే రాజయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు పి మల్లేశం పాశమైలారం పారిశ్రామిక వాడ క్లస్టర్ కన్వీనర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ..మానిక్, పి. పాండురంగ రెడ్డి, కిర్బీ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రాజు, యూనియన్ నాయకులు తలారి శ్రీనివాస్, నాగప్రసాద్, రాములు, లకన్, జైపాల్, సోమన్న, ప్రవీణ్, శంకర్, బిలాల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

6 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago