Telangana

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలో ఈనెల 23న జరిగే జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్లు ఉన్నాయని, తెల్లాపూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, అమీన్పూర్, బొల్లారం, జిన్నారం, గడ్డ పోతారం, గుమ్మడిదల మున్సిపల్ లో దాదాపు 1000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపల్ లో కార్మికులు వందలాదిమంది ఉన్నారన్నారు. జిన్నారం మున్సిపల్ లో గత మూడు నెలలుగా వేత నాలు చెల్లించడం ప్రస్తుత వర్షాకాలంలో తెల్లాపూర్ మున్సిపల్ లో 60 మంది మున్సిపల్ కార్మికులకు నేటికీ రెయిన్ కోర్టులు, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీస వేతనం కింద 26వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. పటాన్ చెరు లో జరిగే మున్సిపల్ కార్మికుల ఐదవ మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. జిల్లాలోని మున్సిపల్ వర్కర్లందరూ ఈనెల 23న పటాన్ చెరు పట్టణంలో జరిగే భారీ ర్యాలీ, మహాసభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయరాం, పోచయ్య, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago