సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు
సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కు వినతి పత్రం అందజేత
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి పనుల మీద విచ్చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గం లోని ఇంద్రేశం మున్సిపల్ లో పనిచేస్తున్న 75 మంది కార్మికులకు మున్సిపల్ ఏర్పడి పది నెలలు గడుస్తున్నా కేవలం గ్రామపంచాయతీ వేతనాలతోనే మున్సిపల్ అధికారులు సరిపెడుతున్నారని ఆరోపించారు. కనీస వేతనం 16,600 వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఏర్పడ్డప్పటినుండి కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే సబ్బు, నూనే ,టవల్స్, బెల్లం తదితర వస్తువులు పది నెలలు గడుస్తున్నా నేటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. జిన్నారం మున్సిపల్ లో గత ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, జిన్నారం మున్సిపల్ ఏర్పడ్డప్పటినుండి నేటికీ యూనిఫాం, ఐడి కార్డులు, ఇతర చట్టపరమైన సౌకర్యాలు ఏ ఒక్కరికి మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్లకు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అనేక సందర్భాల్లో విన్నవించడం జరిగిందన్నారు.ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పోచయ్య, నర్సింలు, మల్లేష్, వెంకటేష్, శ్రీనివాస్, సుధాకర్, అనిత, గండయ్య, సాయి, జిన్నారం నాయకులు శ్రీశైలం, శేఖర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…