Districts

మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి_సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య

– మార్చి 28,29 లలో సమ్మె

మనవార్తలు , పటాన్ చెరు:

మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల పార్లే కార్మికుల గేట్ మీటింగ్ లో రాజయ్య మాట్లాడుతు కార్మిక పోరాటాలతో హక్కులు సాధించుకోవచ్చని, మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని, మోడీ విధానాల పైన దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా కాకుండా కార్మికులు గా చూడాలని కార్మికులను బానిసలుగా మార్చే 4 నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల ను విస్మరించి పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని, దేశ సంపదను సృష్టించే స్తోమత కార్మికులకు ఉందన్నారు.

దేశ అభివృద్ధిలో కార్మిక కర్షకుల పాత్ర కీలకమని అలాంటి వారికిభద్రత కల్పించాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారులకు బానిసగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశాన్ని దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆరోపించారు. కార్మిక కర్షకులు ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవాలని అన్నారు. పెట్టుబడిదారుల చేతి నుండి దేశాన్ని రక్షించుకోవాలని. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జహింగీర్, సంతోష్, కిరణ్, జంగయ్య, సురేందర్ లు పాల్గోన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago