– మార్చి 28,29 లలో సమ్మె
మనవార్తలు , పటాన్ చెరు:
మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల పార్లే కార్మికుల గేట్ మీటింగ్ లో రాజయ్య మాట్లాడుతు కార్మిక పోరాటాలతో హక్కులు సాధించుకోవచ్చని, మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని, మోడీ విధానాల పైన దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా కాకుండా కార్మికులు గా చూడాలని కార్మికులను బానిసలుగా మార్చే 4 నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల ను విస్మరించి పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని, దేశ సంపదను సృష్టించే స్తోమత కార్మికులకు ఉందన్నారు.
దేశ అభివృద్ధిలో కార్మిక కర్షకుల పాత్ర కీలకమని అలాంటి వారికిభద్రత కల్పించాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారులకు బానిసగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశాన్ని దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆరోపించారు. కార్మిక కర్షకులు ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవాలని అన్నారు. పెట్టుబడిదారుల చేతి నుండి దేశాన్ని రక్షించుకోవాలని. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జహింగీర్, సంతోష్, కిరణ్, జంగయ్య, సురేందర్ లు పాల్గోన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…