అన్ని కులాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మన వార్తలు ,పటాన్ చెరు
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో ఇటీవల కోటీ 20 లక్షల 50 వేల రూపాయల సి ఎస్ ఆర్, జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ ల సౌజన్యంతో ఆధునిక హంగులతో ఆధునీకరించారు. బుధవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధి కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశ్రిత పక్షపాతం లేకుండా అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో ఆయా కుల సంఘాల కోసం కమ్యూనిటీ హల్లు, కళ్యాణ మండపాలు సైతం నిర్మించినట్లు తెలిపారు. అందరికోసం అతి తక్కువ ఖర్చుతో వివాహాలు నిర్వహించుకునేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నివర్తి దేవ్, తులసి దాస్, ఎట్టయ్య, రాము, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…