Telangana

ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఆశిష్ గౌడ్ ఖండించారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకుంటూ విమర్శల పాలవుతున్నారని విమర్శించారు. గతంలో ఐలా చైర్మన్ ను ఎమ్మెల్యే బెదిరించిన కేసులో రెండున్నర సంవత్సరాలు శిక్ష పడ్డ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. నేను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు నన్ను ఓడించడానికి నాపైన టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి, 13 కోట్లు ఖర్చు చేయించారని అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా పదివేల ఓట్లు సంపాదించడం జరిగిందని గుర్తు చేశారు. నా పైన ఎన్నో తప్పుడు కేసులు బనాయించారని, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు, ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి నాపైన అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఉందన్నారు. వీరు చేసే ఆగడాలను డిజిపిని కలిసి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని అన్నారు. బీజేపీరాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాలు ముఖ్య మాకు టికెట్ ఇప్పివ్వడం తర్వాత, మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. నాపైన, మా కుటుంబ సభ్యుల పైన, కార్యకర్తల పైన ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అన్నారు. మీరు ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటే, మేమెందుకు విమర్శలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, నరేష్ ముదిరాజ్, నడిమిటి కృష్ణ, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

1 day ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

2 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

2 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

3 days ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

3 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

3 days ago