Telangana

శ్రీకాకుళం సంక్షేమ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

_సొంత నిధులతో 450 గజాల స్థలం కొనుగోలు చేసి అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కులం, మతం, వర్గం, ప్రాంతం తేడా లేకుండా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో సొంత నిధులతో కొనుగోలు చేసిన 450 చదరపు గజాలలో నిర్మించ తలపెట్టిన శ్రీకాకుళం సంక్షేమ సంఘం సామాజిక భవన నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారందరినీ కన్నబిడ్డల వలె చూసుకుంటున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శ్రీకాకుళం జిల్లా వాసులకు 450 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. శుభకార్యాలకు, సమావేశాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉపసర్పంచ్ బండి శంకర్, సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

8 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

8 hours ago

యోగా దినచర్యలో భాగం కావాలి బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా…

13 hours ago

రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50…

13 hours ago

పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ…

13 hours ago

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వందలాది మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా…

13 hours ago