మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తో పాటు, అంబేద్కర్ భవన్, మున్నూరు కాపు కళ్యాణ మండపం, యాదవుల కల్యాణ మండపం, షాదీఖానాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు నివర్తీదేవ్, ఎట్టయ్య, తులసీదాస్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…