యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…
– బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
పటాన్ చెరు:
రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటుకి కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రైతుబంధు డబ్బులు వెంటనే వారి ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనే సమయంలో క్వింటాలుకు ఆరు నుండి ఏడు కిలోల తాళ్ల పేరుతో తరుగు తీయడం సరికాదన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…