Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో

అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహాయ సహకారాలతో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో మన ఊరు మన బడి పథకం ద్వారా 67 లక్షల రూపాయలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్డిసి కాంక్రీట్ ఇండస్ట్రీస్ సి ఎస్ ఆర్ నిధులతో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మరో రెండు అదనపు తరగతి గదులను సోమవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక వసతులతో విద్యాబోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పది లక్షల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పాఠశాలకు రంగులు వేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, పంచాయతీరాజ్ డిఇ సురేష్, ప్రమోద్ గౌడ్, ఆర్డిసి పరిశ్రమ ప్రతినిధి నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

16 నుండి పటాన్‌చెరు వేదికగా ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు

ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…

5 hours ago

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…

5 hours ago

గీతంలో విజయవంతంగా ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…

5 hours ago

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…

1 day ago

నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…

2 days ago

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

2 weeks ago