పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దశాబ్దాల కాలపు ప్రజల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం.. తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని. అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తొలిదశ పోరాటం బీజం వేయగా.. మలిదశ పోరాటంలో. సబ్బండ వర్గాలు ఒక్క తాటిపై నిలిచి సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న మరుపు రాని రోజు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబనను అందించడం జరిగిందని తెలిపారు. విద్యా వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడంతోపాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా కేజీ నుండి పేజీ వరకు విద్యను అందించడం జరిగిందని తెలిపారు.ప్రజలందరి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎమ్మార్వో రంగారావు, ఎంపీడీవో యాదగిరి, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…