Telangana

మిస్ తెలుగు యూఎస్ఏ పోటీలో మెరిసిన గీతం పూర్వ విద్యార్థిని

మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ కిరీటం, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు కైవసం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని చూర్ణికా ప్రియ కొత్తపల్లి మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన చూర్ణిక, ప్రస్తుతం అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారని, గీతంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-2024) పట్టభద్రురాలని తెలిపారు. మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో ఆమె మొదటి రన్నరప్ కిరీటాన్ని గెలుచుకోవడమే గాక, దాదాపు 7,200 పైగా ప్రజా ఓట్లను సంపాదించి, సమీప పోటీదారు కంటే 1,300 మెజారిటీతో గౌరవనీయమైన పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా అందుకున్నట్టు తెలియజేశారు.

ఈ పోటీలలో తనకు మద్దతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా చూర్ణిక కృతజ్జతలు తెలియజేస్తూ, ఈ విజయం తనొక్కరిదే కాదని, ఇది తనను నమ్మిన, తనకు ఓటు వేసిన, ప్రతి అడుగులో తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ చెందుతుందన్నారు. వారి మద్దతు పెద్ద కలలు కనడానికి బలాన్నిచ్చిందని అభిప్రాయపడ్డారు.సాంకేతిక విద్యతో పాటు 14 ఏళ్లగా భరత నాట్య కళాకారిణిగా ఆమె శాస్త్రీయంగా శిక్షణ పొందుతోందని, ఈ కళాత్మక ప్రయాణం ఆమెకు క్రమశిక్షణ, సృజనాత్మకత, స్థితిస్థాపకతను ఇచ్చిందన్నారు.బలమైన విద్యా పునాది, కళల పట్ల లోతైన నిబద్ధత, అంతర్జాతీయ వేదికలపై పెరుగుతున్న గుర్తింపుతో, చూర్ణిక, గీతం యొక్క స్ఫూర్తిని ఉదాహరణగా చూపిస్తోందని తెలిపారు. శ్రేష్ఠత, ఆశయం, సమాజ సేవ, శాశ్వత ప్రభావాన్ని చూపాలనే సంకల్పంతో, ఆమె కొత్త మార్గాలను అన్వేషిస్తూ, ప్రపంచ సంబంధాలను నిర్మిస్తూ, స్ఫూర్తిని కొనసాగిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago