మనవార్తలు , పటాన్ చెరు
అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో అక్షయపాత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కార్యక్రమాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పట్ల ఎవరు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో వ్యాక్సినేషన్ పక్రియ సమర్ధవంతంగా నిర్వహించిన మూలంగానే థర్డ్ వేవ్ సమయంలో మరణలా సంఖ్య, ఆస్పత్రిలో చేరడం గణనీయంగా తగ్గిందని అన్నారు. వ్యాక్సింగ్ వేసుకున్న వారికి పది రోజుల పాటు నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నా అక్షయ పాత్ర ఫౌండేషన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, గోపాల్, చంద్రశేఖర్, అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…