_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం
మనవార్తలు ,చౌటుప్పల్:
బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు గురువారం లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతి యువకులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను సవివరంగా వివరించారు. ఓటు వేసే విధానాన్ని నమూనా బ్యాలెట్ ద్వారా అవగాహన కల్పించారు. స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యువత, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా ఓటు హక్కు పొందిన ప్రతి యువతి, యువకుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలి ఆయన కోరారు.
మా సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ కే..
యువత ఏకగ్రీవ తీర్మానం
నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా అందిస్తామని వారు తెలిపారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…