Telangana

ఫుడ్ సైన్స్ లో అపార అవకాశాల…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రొఫెసర్ విజయా ఖాదర్

మనవార్తలు ,పటాన్ చెరు:

ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలున్నాయని , విద్యార్థుల అభిరుచికి తగ్గ విభాగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , హోమ్ సెన్ట్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ ఖాదర్ అన్నారు . ‘ కనెక్ట్ ‘ ఉపన్యాసాల పరంపరలో భాగంగా , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ , డెరైక్టరేట్ ఆఫ్ ఎక్స్టెర్నల్ రిలేషన్స్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . విద్యార్థుల కెరీర్ను ఎలా మలచుకోవాలి , పరిశోధనావకాశాలు , ఔషధ , రసాయన పరిశ్రమలలో ఫుడ్ సెన్స్ , టెక్నాలజీ నెపుణ్యాలను ఎలా అన్వయిస్తారు అనే అంశాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు . తాను హోమ్ సెన్స్డ్ బోధించేటప్పుడు ‘ వండుకోని , తినేదేగా ‘ అని తోటి అధ్యాపకులే చులకన చేసిన సందర్భాలు ఉన్నాయని , తాను ఎంపిక చేసుకున్న రంగంలో ఇష్టంగా పనిచేయడం . ద్వారా రెండు మేథోహక్కులు , 86 పరిశోధనా పత్రాలు , ఆరు విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశ పుస్తకాలు , 22 పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి , ఎన్నో అవార్డులు , రివార్డులను పొందినట్టు విద్యార్థుల హర్షధ్వానాల డాక్టర్ విజయ సగర్వంగా ప్రకటించారు .

ఫుడ్ సె భద్రత , నాణ్యత నియంత్రణ , ఉత్పత్తుల అభివృద్ధి వంటి పలు విభాగాలున్నాయని , ఆయా విద్యార్థుల నేపథ్యం , అభిరుచికి తగ్గవాటిని ఎంపిక చేసుకుని రాణించాలని ఆమె సూచించారు . ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగానే ఉన్నాయని , వృత్తిలో నెపుణ్యం సాధించిన వారికి విశ్వవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు . తెలివిగా ఆలోచించగలిగితే ఈ రంగంలో స్వయం ఉపాధి చేపట్టి సులువుగా రాణించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ స్పష్టీకరించారు . పూర్వకాలంలో ఇళ్ళలో చేసుకునే ఉలవచారు ఈ రోజు ఐదు నక్షత్రాల హోటళ్ళు , ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్లలో మెనూగా మారిందని , అలాగే పాలతాళికలు , కొబ్బరి / రాగి ఉండలు అని ఆమె వివరించారు . ఫుడ్ ప్రాసెసింగ్ లేక దాదాపు 30 శాతం వ్యవసాయ ఉత్పత్తులు ప్రతియేటా వృథాగా పోతున్నాయని , అంటే రమారమి రూ .580 కోట్ల విలువైనవని , అవి 23 కోట్ల మంది క్షుద్బాధను తీర్చగలవని చెప్పారు .

గ్రామీణ ప్రాంతాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా అటు ఉత్పత్తుల వృథాను అరికట్టడమే గాక ఉపాధి అవకాశాలు , మహిళా సాధికారతను కల్పించవచ్చని డాక్టర్ విజయా ఖాదర్ పేర్కొన్నారు . ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిసతి ప్రొఫెసర్ ఉమామహేశ్వరి స్వాగతోపన్యాసం చేయగా , కెరీర్ గెడైన్స్ సెల్కు చెందిన కెరియల్ ఫుల్ఫిల్మెంట్ అధికారి డాక్టర్ రమాకాంత్ బాల్ వందన సమర్పణ చేశారు . డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , డాక్టర్ జి.నిహారిక , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago