_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తక్షణమే తాహెర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనల మేరకు స్వయంగా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మూడు లక్షల రూపాయల వ్యయంతో శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. గురువారం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు.నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని తాహెర్ తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…