పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కలెక్టర్ గా ,జాయింట్ కలెక్టర్ గా పనిచేసి, విశేష అనుభవం కలిగిన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి విజయానికి సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తో కలిసి పటాన్చెరు డివిజన్ లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సపాన్ దేవ్, శంకర్ యాదవ్, ప్రతాప్ సేటు తదితరులను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనారంగంలో ఎంతో అనుభవం ఉన్న వెంకట్రామరెడ్డి ఎంపీ గా గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు..ఎంపీ గానే కాకుండా స్వంత గా 100 కొట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి జాబ్ మేళా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు..అలాగే నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి శుభకార్యాలకు అందించడం జరుగుతుందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, 6 గ్యారంటీలు ఆటకెక్కాయన్నారు..బీజేపీ తెలంగాణ కు చేసిందేమీ లేదన్నారు..మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని, పనిమంతుడైన వెంకట్రామరెడ్డి కి మద్దతు తెలుపాలన్నారు. మన లోకల్ నివాసి, తెల్లాపూర్ కు చెందిన వెంకట్రామరెడ్డి కి ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలని కోరారు..మాయ మాటలు రావని, మాట తప్పే వాణ్ణి కాదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తెలిపారు. పఠాన్ చెరు ప్రాంతంలో ఉన్న సమస్యలపై, వాటి పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు..ఈ ప్రాంత సమస్య లపై పార్లమెంటు లో గళమెత్తుతానన్నారు..ఈ ప్రాంత వాసిగా , ప్రజా సేవ కోసం వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…