అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
అవినీతికి చిరునామాగా పేరొందిన కాంగ్రెస్ పార్టీని..మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రత్యేక తెలంగాణ సాధించి దశాబ్ది కాలంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో ఎంపీపీ దేవానందం గృహంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బిఆర్ఎస్ పార్టీ విజయం అత్యంత ఆవశ్యకమని, వెంకట్రామ్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేసి భారీ మెజార్టీ అందించాలని వారికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించి ఓట్లు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…