Telangana

కాంగ్రెస్.. బిజెపిలు దొందు దొందే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :

అవినీతికి చిరునామాగా పేరొందిన కాంగ్రెస్ పార్టీని..మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రత్యేక తెలంగాణ సాధించి దశాబ్ది కాలంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో ఎంపీపీ దేవానందం గృహంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బిఆర్ఎస్ పార్టీ విజయం అత్యంత ఆవశ్యకమని, వెంకట్రామ్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేసి భారీ మెజార్టీ అందించాలని వారికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించి ఓట్లు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago