పటాన్చెరు
తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్య శాఖ ను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకీ చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో ఏడు లక్షల రూపాయల విలువైన మూడున్నర లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 42 సొసైటీల ద్వారా 70 లక్షల రూపాయల విలువైన 35 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి లాభాలు గడించాలని కోరారు.
మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మత్స్య శాఖ జిల్లా అధికారి సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తులసి దాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు లేని బాలుడి కోరిక తీర్చిన మధు ముదిరాజ్ సైకిల్
కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…