పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
బల్దియ పరిధిలోని డివిజన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్ కాలనీలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీఠ వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, భారత్ రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బండ్లగూడ ఏరియా అధ్యక్షులు గోపాల్, కొమరగూడెం వెంకటేష్, చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…