పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను శుక్రవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి యోగాపై శ్రద్ధ పెరిగేలా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగ అభ్యాసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తులసీదాస్, కుమార్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి కృపాకర్, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…