పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను శుక్రవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి యోగాపై శ్రద్ధ పెరిగేలా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగ అభ్యాసనాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తులసీదాస్, కుమార్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి కృపాకర్, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…