కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి జిల్లాకు కావలిసిన సదుపాయాలను సమకూరుస్తుందని అమీన్పూర్ మండలం దినదిన అభివృద్ధి చెందుతుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఈర్ల నితిషా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…