కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి జిల్లాకు కావలిసిన సదుపాయాలను సమకూరుస్తుందని అమీన్పూర్ మండలం దినదిన అభివృద్ధి చెందుతుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఈర్ల నితిషా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…