Telangana

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్.

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి..

_సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

_ఏప్రిల్ 1 నుండి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు ప్రారంభం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హామీలు ఇవ్వడం ఆపై మర్చిపోవడం అలవాటుగా మారిన ప్రస్తుత రాజకీయాల్లో.. హామీ ఇస్తే అమలు చేసే వరకు పట్టువదలని విక్రమార్కుడు వలె నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరొందిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి పర్వదినాన శుభవార్తను అందించారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో నెంబర్ 30ని జారీ చేశారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం మండలాలను చేరుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం అన్నారు.సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకి రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేదని అన్నారు. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని తెలిపారు.ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.నూతన భవనం అందుబాటులో వచ్చేవరకు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే పటాన్చెరు సబ్ రిజిస్టార్ కార్యాలయం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పటాన్చెరువు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నూతన కార్యాలయం భవనాన్ని నెల రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ గారి సభలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రెండు హామీలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జి ఎం ఆర్ తెలిపారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తో పాటు 70 కోట్ల రూపాయలతో బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 100 ఫీట్ల రహదారుని విస్తరించడం జరిగిందని తెలిపారు.పటాన్చెరు, జిన్నారంలలో మున్సిఫ్ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారుహెచ్ఎండిఏ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరుగుతుందని తెలిపారు.ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆడిట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ సేవలు సైతం పటాన్చెరులోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, రాజు, షేక్ హుస్సేన్, గోపాల్, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, పృథ్విరాజ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago