Categories: politicsTelangana

కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్

హామీ ఇచ్చారు..అండగా నిలిచారు 

అగర్వాల్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేత 

యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం 

కృతజ్ఞతలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు

ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హామీ ఇస్తే అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించారు. గత నెల రోజుల క్రితం..బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ (34) పటాన్చెరు డివిజన్ పరిధిలోని అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక కార్మికులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి 65 లక్షల రూపాయల నష్టపరిహారం అందించేలా ఒప్పించారు. అనంతరం బంధువుల సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు.ఒప్పందానికి అనుగుణంగా.. గురువారం సాయంత్రం పటాన్చెరు లోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా.. మృతుడి కుటుంబ సభ్యులకు 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలను పాటిస్తూ.. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలలో పనిచేస్తున్న క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులకు పని ప్రదేశాల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నర్శపరిహారం డబ్బుని మృతుని భార్యతో పాటు.. వారి పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వారి భవిష్యత్తుకు భరోసా అందిస్తున్నామని తెలిపారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

13 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago