Categories: politicsTelangana

కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జిఎంఆర్

హామీ ఇచ్చారు..అండగా నిలిచారు 

అగర్వాల్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేత 

యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం 

కృతజ్ఞతలు తెలిపిన మృతుడి కుటుంబ సభ్యులు

ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హామీ ఇస్తే అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు.. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించారు. గత నెల రోజుల క్రితం..బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ (34) పటాన్చెరు డివిజన్ పరిధిలోని అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక కార్మికులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి 65 లక్షల రూపాయల నష్టపరిహారం అందించేలా ఒప్పించారు. అనంతరం బంధువుల సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు.ఒప్పందానికి అనుగుణంగా.. గురువారం సాయంత్రం పటాన్చెరు లోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇతర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా.. మృతుడి కుటుంబ సభ్యులకు 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలను పాటిస్తూ.. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలలో పనిచేస్తున్న క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులకు పని ప్రదేశాల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నర్శపరిహారం డబ్బుని మృతుని భార్యతో పాటు.. వారి పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వారి భవిష్యత్తుకు భరోసా అందిస్తున్నామని తెలిపారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

27 minutes ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

20 hours ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

5 days ago