Telangana

దేశభక్తి, ఉత్సాహంతో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జెండాను ఎగురవేసి, స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన ప్రోవీపీ ప్రొఫెసర్ డీ.ఎస్. రావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని గాంధీజీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా, దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించారు. ఉదయం 8.50 గంటలకు ఆరంభమైన ఈ వేడుకలలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ శుభ సందర్భంగా, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జాతీయ జెండాను ఎగురవేసి, దేశ నిర్మాణంలో విద్యా సంస్థల పాత్రను ప్రతిబింబిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ప్రసిద్ధ జై జవాన్, జై కిసాన్ లకు జై విజ్జాన్, జై అనుసంధాన్ లను జోడించడం ద్వారా భారతదేశ పురోగతికి దోహదపడాలని ఆయన విద్యా సమాజాన్ని కోరారు. మేధో, సాంకేతిక స్వావలంబనను సాధించడంలో నిజమైన స్వాతంత్ర్యం ఉందని, విద్య ఆత్మ విశ్వాసం, సామర్థ్యం, నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం వహించడానికి సరైన వైఖరిని పెంపొందించాలని ప్రొఫెసర్ డి.ఎస్. రావు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ క్యాడెట్లు, విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించేలా కవాతు నిర్వహించారు. కళాకృతి విద్యా విభాగం శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించగా, భద్రతా సిబ్బంది మనోహరమైన దేశభక్తి గీతాలను ఆలపించారు.భద్రతా సిబ్బందికి వారి అంకితభావం, సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఎన్ సీసీ క్యాడెట్ల ర్యాంక్ వేడుక జరిగింది. దేశ స్వాతంత్ర్యానికి చిరస్మరణీయమైన, అర్థవంతమైన నివాళిగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్ లైఫ్ బృందం చాలా జాగ్రత్తగా సమన్వయం చేసింది. ఇందులో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు, అల్పాహారం అందించడంతో ఈ వేడుకలు ముగిశాయి.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago