మనవార్తలు ,పటాన్చెరు
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అతి పిన్నవయసులో స్వరాష్ట్ర సాధనకై అమరుడైన గొప్ప వ్యక్తి శ్రీకాంత్ చారి అని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, రాజేష్, షేక్ హుస్సేన్, పాండు, మన్నే రాజు, మహేష్, ప్రమోద్ గౌడ్, కృష్ణ మూర్తి, తారా సింగ్, తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…