politics

జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అపూర్వ కానుక

_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్

_జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో విధులు నిర్వహిస్తున్న 80 మంది పాత్రికేయులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందించారు.

సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జర్నలిస్టుల సోదరులకు వీటిని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 15 లక్షల రూపాయల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకమని అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారంలో సైతం ముందుంటున్నారని అభినందించారు.నియోజకవర్గ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం పట్ల జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ జర్నలిస్టులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ కార్మికు విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, వంగరి అశోక్, మెరాజ్ ఖాన్, నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago