politics

జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అపూర్వ కానుక

_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్

_జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో విధులు నిర్వహిస్తున్న 80 మంది పాత్రికేయులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందించారు.

సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జర్నలిస్టుల సోదరులకు వీటిని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 15 లక్షల రూపాయల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకమని అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారంలో సైతం ముందుంటున్నారని అభినందించారు.నియోజకవర్గ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం పట్ల జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ జర్నలిస్టులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ కార్మికు విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, వంగరి అశోక్, మెరాజ్ ఖాన్, నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

3 days ago