Telangana

సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి

ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి

అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.మంగళవారం సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు లతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సందర్శించారు. దుర్ఘటన జరిగిన పరిశ్రమలోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

 ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పాశమైలారంలో వేలాది బల్క్ డ్రగ్స్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా పలు పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకుండా శిక్షణ లేని దినసరి కార్మికులతో రియాక్టర్లు, బాయిలర్లు నడిపిస్తున్నారని  దీని మూలంగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. యాజమాన్యాల కక్కుర్తి మూలంగా కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం. ప్రత్యేక కమిటీని మించి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి. భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం అవుతున్నప్పటికీని ఇస్నాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్రామా కేర్ ద్వారా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సత్వర వైద్యం అందించగలుగుతామని తెలిపారు.అదే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కు చెందిన నిరుపేద ప్రజలు పొట్టకూటి కోసం స్థానిక పరిశ్రమలలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని వారికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించేలా. యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అనంతరం పటాన్చెరువు పట్టణంలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

24 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago