Telangana

సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి

ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి

అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.మంగళవారం సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు లతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సందర్శించారు. దుర్ఘటన జరిగిన పరిశ్రమలోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

 ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పాశమైలారంలో వేలాది బల్క్ డ్రగ్స్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా పలు పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకుండా శిక్షణ లేని దినసరి కార్మికులతో రియాక్టర్లు, బాయిలర్లు నడిపిస్తున్నారని  దీని మూలంగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. యాజమాన్యాల కక్కుర్తి మూలంగా కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం. ప్రత్యేక కమిటీని మించి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి. భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం అవుతున్నప్పటికీని ఇస్నాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్రామా కేర్ ద్వారా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సత్వర వైద్యం అందించగలుగుతామని తెలిపారు.అదే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కు చెందిన నిరుపేద ప్రజలు పొట్టకూటి కోసం స్థానిక పరిశ్రమలలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని వారికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించేలా. యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అనంతరం పటాన్చెరువు పట్టణంలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago