భవిషత్ లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన
నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మినీ ఇండియాగా పేరుపొందిన పటాన్చెరు పారిశ్రామిక వాడా అయినటువంటి పాశామైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించడం చాలా బాధాకరం అని నవభారత్ నిర్మాణ్ యువసేన అద్యక్షుడు మెట్టుశ్రీధర్ అన్నారు.యాజమాన్యం నిర్లక్ష్యం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని.తెలిపారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని భాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాధితులకు కోఠి రూపాయల నష్టపరిహారం చెల్లించి క్షత్ర గాత్రులకు యాభైలక్షల పరిహారం ఇవ్వాలని మెట్టుశ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ,లింగం రవీందర్, లక్ష్మణ్ డప్పు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…