Telangana

ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలి

తక్షణం మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి

పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి

ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు , గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలి

పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శ జాన్ వెస్లీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే ఇక్కడికి రప్పించాలని,ఈ దుర్ఘటనపై సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలని, తక్షణం మృతుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈరోజు పాశం మైలారం ప్రాంతంలో పేలిన సిగాచి పరిశ్రమ ప్రాంతాన్ని సిపిఎం ప్రతినిధి బృందంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు.. గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. చికిత్స పొందుతూన్న కార్మికుల్లో కూడా అనేకమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు, కార్మికుల మృత్యువాతలు పడుతున్న ప్రభుత్వ అధికారులు కానీ, పరిశ్రమల యజమాన్యాలు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.

ఆసియా ఖండంలోనే పేరొందిన ఈ ప్రాంతంలో “మృత్యు ఘటన” అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవలని అన్నారు. పరిశ్రమల యజమాన్యము లాభార్జనే ధ్యేయంగా రియాక్టర్లు పెళయన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పని చేయించడం సరైంది కాదన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో పని చేయించడం వల్లనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నాయకులు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago