పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 30 వేల మంది విద్యార్థులు ఒకే సమయాన సామూహిక గీతాలాపన చేసేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…