_భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి
_భక్తుల సంఖ్యకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా 50 అడుగుల మహా శివలింగం, మహాశివుడి ప్రతిమలను ఏర్పాటు చేసి వేద పండితులచే మహన్యాస రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, ప్రముఖ సినీ నేపథ్య గాయకులచే సంగీత విభావరి,. సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తులందరూ ఉపవాస దీక్ష విరమించిన అనంతరం శివపార్వతుల కళ్యాణం కనులారా వీక్షించి ఆ పరమశివుడి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,. మాజీ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మెరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…