_భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి
_భక్తుల సంఖ్యకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా 50 అడుగుల మహా శివలింగం, మహాశివుడి ప్రతిమలను ఏర్పాటు చేసి వేద పండితులచే మహన్యాస రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, ప్రముఖ సినీ నేపథ్య గాయకులచే సంగీత విభావరి,. సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తులందరూ ఉపవాస దీక్ష విరమించిన అనంతరం శివపార్వతుల కళ్యాణం కనులారా వీక్షించి ఆ పరమశివుడి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,. మాజీ ఎంపిటిసి రామచంద్రారెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మెరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…