మన వార్తలు , అమీన్పూర్
గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట, వడక్ పల్లి, దాయర, బొమ్మన్ కుంట, గండిగూడెం గ్రామాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరత ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, మహిళా మండలి భవనాలను జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న రక్షిత మంచినీరు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లలిత మల్లేష్, భాస్కర్ గౌడ్, కృష్ణ, మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…