కర్నూల్:
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల కు అలంకార దర్శనాలు క ల్పించడంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవోలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెల్లవారుజుమున కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీపదానాలు చేశారు.
స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ధ్ద వహించాలని కోరారు. అదేవిధంగా కార్తీక దీపాలనువెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏఈవో హరిదాసు తెలిపారు. విద్యుద్దీపకాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…