మనవార్తలు ,పటాన్ చెరు:
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ తరగతులను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 90 రోజుల పాటు కష్టపడి చదివితే జీవితాంతం సమాజంలో తలెత్తుకుని బ్రతకవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకు లతోపాటు, ఉన్నత అధికారుల చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని, అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శిక్షణ తరగతుల ఇంఛార్జి గోపి శంకర్, ఎస్సై నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…