ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు
మనవార్తలు , పటాన్ చెరు:
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న 62 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు హారిక విజయ్ కుమార్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…
బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఈనెల 25న…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ…