Telangana

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు..

అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు

అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 

77 మీటర్ల జాతీయ జెండాతో మార్చ్ ఫాస్ట్

4 లక్షల 40 వేల రూపాయల సొంత నిధులచే నగదు బహుమతులు పంపిణీ..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సహకారం..ప్రజల అండదండలతో పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, ముదిరాజ్ భవన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మినీ ఇండియాగా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను సాధిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అశ్వాలతో కలిసి 77 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన మార్చి ఫాస్ట్ అందర్నీ అలరించింది. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్ అందరినీ అలరించాయి. వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలలకు ప్రథమ బహుమతి 20 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు, తృతీయ బహుమతి 10 వేల రూపాయలు, పోటీలో పాల్గొన్న ప్రతి పాఠశాలకు 5000 రూపాయల చొప్పున 4 లక్షల 40 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్ సపానదేవ్,తహసిల్దార్ హరి బాబు, ఎంపీడీవో యాదగిరి, డీఎస్పీ ప్రభాకర్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎంఈఓలు నాగేశ్వరరావు నాయక్, రాథోడ, సీఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago