ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుడు కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మగ్దంపూర్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి గత కొద్ది రోజుల క్రితం జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని ఆరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధుల్లో చేరాడు. ఇటీవల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కార్మికుడికి న్యాయం చేయాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…