మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు మరియు యువజన శాఖల నూతన మంత్రి వాకిటి శ్రీహరి ని మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ని శాలువాతో ఘనంగా సత్కరించి, సౌహార్దపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువతకి రాజకీయ అవకాశాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ: సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేయాలి. యువతకు రాజకీయ, ఆర్థిక రంగాలలో అవకాశాలు కల్పించగలగాలని పేర్కొన్నారు.
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…