మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :
రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ సహకారంతో మహిళలందరి కోసం స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని తమకాలపై తాము నిలబడేటట్లుగా ఒక చక్కని అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం బుధవారం రోజు పాఠశాల ఆవరణలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన మహిళలందరూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సంధ్యా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా.ఆమె మాట్లాడుతు మహిళల కోసం ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తాను కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలందరికీ ఇది ఒక్క గొప్ప అవకాశం అని చెప్పారు. ఈ ట్రైనింగ్ కి 13 రకాలుగా ఉపయోగపడే కావలసిన సామాగ్రి (మెటీరియల్) అంతా కూడా ఏ .భరత్ కుమార్ గౌడ్ గారు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి 200 పైగా మహిళలు విచ్చేసి తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇంకా ఎంతోమంది ముందుకు రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నారని భరత్ కుమార్ తెలిపారు.ఇలాంటి కార్యక్రమం నానక్ రామ్ గూడ లో కూడా ప్రారంభం చేస్తామని చెప్పారు .ఇలాంటి అవకాశం మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి ఉపాధిని కల్పించుకోవాలనీ సూచించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…